Thursday, March 28, 2024

ఐసిసి వన్డే ర్యాంకింగ్స్ ప్రకటన..

- Advertisement -
- Advertisement -

 

ICC Announces ODI Rankings 2020

దుబాయ్‌:  టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలు ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌లో సత్తా చాటారు. తాజాగా వన్డే ర్యాంకింగ్స్ జాబితాను ఐసిసి ప్రకటించింది. ఇందులో విరాట్ కోహ్లీ 871 పాయింట్లతో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 855 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత పాకిస్థాన్ ఆటగాడు బాబర్‌ అజామ్‌ 829 పాయింట్లతో మూడు స్థానంలో దక్కించోగా.. ఇంగ్లాండ్ ఆటగాడు టేలర్, సౌతాఫ్రికా ఆటగాడు డు ప్లిసెస్ వరుసగా నాలుగు, ఐదో స్థానంలో నిలిచారు.‌ ఆస్ట్రేలియాతో జరిగని వన్డే సిరీస్‌లో రాణించిన బెయిర్‌ స్టో టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ, రోహిత్ తర్వాత టాప్ 10లో మరో ఇండియా ప్లేయర్ చోటు దక్కించుకోలేదు. ఇక, బౌలర్ల జాబితాలో న్యూజిలాండ్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ అగ్రస్థానంలో నిలువగా, టీమిండియా యంగ్ బౌలర్‌ బుమ్రా రెండో స్థానంలో నిలిచాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో అఫ్గనిస్థాన్‌ ప్లేయర్ మహ్మద్‌ నబీ(301) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, రవీంద్ర జడేజా ఎనిమిదో ర్యాంకులో నిలిచాడు.

ICC Announces ODI Rankings 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News