Wednesday, April 17, 2024

ఐసిసి ర్యాంకింగ్స్‌లో మిథాలీ రాజ్ టాప్

- Advertisement -
- Advertisement -

ICC women’s ODI rankings: Mithali Raj at the top

 

దుబాయి: భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఆమె 762 పాయింట్లతో దక్షిణాఫ్రికా ఓపెనర్ లిజెల్లీ లీతో కలిసి ఉమ్మడిగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 91 పరుగులు చేసి లీ తన ర్యాంక్‌ను మెరుగుపర్చుకుని అగ్రస్థానానికి చేరుకుంది. మరో భారత బ్యాట్స్ స్మృతి మంధాన తొమ్మిదో స్థానం దక్కించుకుంది. ఇక బౌలింగ్ విభాగంలో సీనియర్ బౌలర్ జులన్ గోస్వామి , స్పిన్నర్ పూనమ్ యాదవ్ వరసగా అయిదు, తొమ్మిదో స్థానాల్లో కొనసాగుతున్నారు. ఆల్‌రౌండర్ విభాగంలో దీప్తి శర్మ ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇక టి20 ర్యాకింగ్స్‌లో భారత యువ సంచలనం షెఫాలీ వర్మ బ్యాటింగ్ విభాగంలో మొదటి స్థానం దక్కించుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన బెత్ మూనీ రెండో స్థానంలో, టి20 వైస్ కెప్టెన్ స్మృతి మంధాన మూడో స్థానంలో కొనసాగుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News