Friday, April 26, 2024

థియేటర్‌కు రావడానికి సాహసిస్తున్నది తెలుగు జాతి మాత్రమే

- Advertisement -
- Advertisement -

'Ichata Vahanamulu Niluparadu' movie pre release event

ఎస్.దర్శన్ దర్శకత్వంలో హీరో సుశాంత్ నటించిన తాజా చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’. రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను ఏఐ స్టూడియోస్-, శాస్త్ర మూవీస్ బ్యానర్లపై రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీష్ కోయలగుండ్ల నిర్మిస్తున్నారు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హీరో హీరోయిన్లు సుశాంత్, మీనాక్షి చౌదరి, అవసరాల శ్రీనివాస్, వి.ఎన్.ఆదిత్య, జెమినీ కిరణ్, హరీష్, సాయిబాబా, అభినవ్ గోమటం తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ..“ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తం మీద థియేటర్‌కు రావడానికి సాహసిస్తున్న జాతి తెలుగు జాతి మాత్రమే. ఇక సుశాంత్ తనకు తెలియకుండానే ఓ చట్రంలో ఇరుక్కుపోయాడని అనుకునేవాడిని. అయితే ‘చి.ల.సౌ’ సినిమాతో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే పనిలో పడ్డాడు. ఆ సినిమా చూసే నేను ‘అల వైకుంఠపురములో’ నటించమని అడిగాను. ఇప్పుడు తన హ్యాట్రిక్ మూవీ ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. హీరో సుశాంత్ మాట్లాడుతూ “నిజ ఘటన ఆధారంగా తెరకెక్కించిన సినిమా ఇది. నా పాత్రలో చాలా షేడ్స్ ఉన్నాయి. ఈ సినిమాలో చాలా మంచి పాత్ర చేశాను”అని తెలిపారు. దర్శకుడు దర్శన్ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో కొత్త సుశాంత్‌ను చూస్తారు. థ్రిల్లర్ జోనర్‌లోని ఈ మూవీలో చాలా లేయర్స్ ఉన్నాయి”అని పేర్కొన్నారు.

‘Ichata Vahanamulu Niluparadu’ movie pre release event

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News