Friday, April 26, 2024

టాటా మెమోరియల్ సెంటర్‌కు ఐసిఐసిఐ బ్యాంక్ భారీ విరాళం

- Advertisement -
- Advertisement -

ముంబై: దేశవ్యాప్తంగా క్యాన్సర్ చికిత్స మరియు పరిశోధనా కేంద్రాలను నిర్వహిస్తున్న ప్రముఖ సంస్థ , టాటా మెమోరియల్ సెంటర్ (TMC)కి రూ.1,200 కోట్లు విరాళంగా అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. మహారాష్ట్రలోని నవీ ముంబై, పంజాబ్‌లోని ముల్లన్‌పూర్‌, మరియు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోని TMC కేంద్రాలు కలిపి 7.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు కొత్త భవనాలను ఏర్పాటు చేయడానికి, వాటికి అత్యాధునిక యంత్రాలను అమర్చడానికి ICICI బ్యాంక్ తన CSR నిధుల నుండి డబ్బును విరాళంగా ఇస్తుంది.

TMCకి ఏదైనా ఒక సంస్థ నుండి లభించిన అతిపెద్ద సహకారం ఇది. ICICI బ్యాంక్ యొక్క CSR విభాగం ICICI ఫౌండేషన్ ఫర్ ఇన్‌క్లూజివ్ గ్రోత్ (ICICI ఫౌండేషన్) ఈ కార్యక్రమం అమలు చేస్తుంది, ఇది 2027 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది.ఆధునిక పరికరాలు మరియు ప్రత్యేక మల్టీడిసిప్లినరీ బృందాలతో, ఆంకాలజీ చికిత్సలో ఈ కొత్త కేంద్రాలు సంవత్సరానికి దాదాపు 25,000 మంది కొత్త రోగులకు అధునాతన మరియు నిరూపిత ఆధారిత చికిత్సలను అందిస్తాయి, ప్రస్తుత సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తాయి మరియు దేశంలోని క్యాన్సర్ చికిత్సా మౌలిక సదుపాయాలకు గణనీయమైన ప్రోత్సాహాన్ని అందిస్తాయి. ఈ నిబద్ధతను తెలియజేసేందుకు ICICI ఫౌండేషన్ TMCతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఐసిఐసిఐ ఫౌండేషన్ ప్రెసిడెంట్ సంజయ్ దత్తా, టాటా మెమోరియల్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ ఆర్ ఎ బద్వే ఐసిఐసిఐ బ్యాంక్ చైర్మన్ గిరీష్ చంద్ర చతుర్వేది మరియు ICICI బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ , శ్రీ సందీప్ బాత్రా సమక్షంలో ఒప్పందంపై సంతకాలు చేశారు.ముంబైలోని పరేల్‌లోని టాటా మెమోరియల్ హాస్పిటల్‌లో డాక్టర్ బద్వే మరియు శ్రీ బాత్రా సమక్షంలో ఈరోజు ICICI MRI ఫెసిలిటీని శ్రీ చతుర్వేది ప్రారంభించారు. ఈ సదుపాయం ICICI ఫౌండేషన్ మద్దతుతో అధునాతన MRI యంత్రంతో అమర్చబడింది,

ఈ సందర్భంగా ఐసిఐసిఐ బ్యాంక్‌ ఛైర్మన్‌ గిరీష్‌ చంద్ర చతుర్వేది మాట్లాడుతూ ” ఐసిఐసిఐ బ్యాంక్‌కు దేశ సేవ పరంగా సుదీర్ఘ వారసత్వం ఉంది. ఈ సిద్ధాంతానికి అనుగుణంగా, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర జీవనోపాధికి నైపుణ్యాభివృద్ధి, అందుబాటులో ఆరోగ్య సంరక్షణ మరియు కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లలో వివిధ కార్యక్రమాల ద్వారా పౌరుల శ్రేయస్సును మెరుగుపరచడానికి ICICI ఫౌండేషన్ నిరంతరం కృషి చేస్తోంది. గత కొద్ది సంవత్సరాలుగా, ICICI ఫౌండేషన్ దేశవ్యాప్తంగా 2.6 మిలియన్లకు పైగా చెట్లను నాటింది, 5000 గ్రామీణ పాఠశాలలు మరియు వాటర్‌షెడ్ నిర్మాణాల వద్ద సంవత్సరానికి 17.1 బిలియన్ లీటర్ల వర్షపు నీటిని సేకరించే సామర్థ్యాన్ని సృష్టించింది, గ్రామీణ పాఠశాలలకు రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్‌లను ఏర్పాటు చేసింది, నైపుణ్య కార్యక్రమం ల ద్వారా 2.9 మిలియన్ల మందికి ప్రయోజనం చేకూర్చింది. వీరిలో సగానికి పైగా మహిళలు వున్నారు. ఇది తమ సామాజిక కార్యక్రమాల ద్వారా 6.5 మిలియన్లకు పైగా వ్యక్తులకు మరియు దాని ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల ద్వారా 1.5 మిలియన్ల మంది జీవితాలకు ప్రయోజనం చేకూర్చింది. మొత్తంమీద, ICICI ఫౌండేషన్ దాని వివిధ కార్యక్రమాల ద్వారా 10.9 మిలియన్ల కంటే ఎక్కువ మంది లబ్ధిదారుల పై సానుకూలంగా ప్రభావితం చూపింది.

2027 నాటికి నవీ ముంబై, ముల్లన్‌పూర్ మరియు విశాఖపట్నంలోని TMC కేంద్రాలలో మూడు కొత్త బ్లాకులను నిర్మించడానికి మేము రూ. 1,200 కోట్లను అందజేస్తున్నాము. ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహించడం కోసం మా నిబద్ధతలో భాగంగా, ఈ కార్యక్రమం మన దేశంలోని వివిధ ప్రాంతాలలో సమగ్ర క్యాన్సర్ సంరక్షణ సేవలను మెరుగుపరుస్తుంది. రోగులకు అధునాతన మరియు తాజా క్యాన్సర్ చికిత్సలకు తగిన అవకాశాలు అందించడంలో భాగంగా ఈ కొత్త భవనాలు ప్రాంతీయ రెఫరల్ కేంద్రాలుగా కూడా సేవలు అందిస్తాయి మరియు ముంబైలోని పరేల్‌లో ఉన్న టాటా మెమోరియల్ హాస్పిటల్‌ను సందర్శించడానికి రోగులు చాలా దూరం ప్రయాణించాల్సిన అవసరాన్ని తగ్గిస్తాయి” అని అన్నారు.

ఈ సందర్భంగా టాటా మెమోరియల్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.ఎ.బద్వే మాట్లాడుతూ, “దేశవ్యాప్తంగా క్యాన్సర్ సంరక్షణను మెరుగుపరచడానికి అతిపెద్ద CSR కార్యక్రమాలలో ఒక దానిని ప్రారంభించిన ICICI ఫౌండేషన్‌కు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. నవీ ముంబై, విశాఖపట్నం, ముల్లన్‌పూర్‌లోని టాటా మెమోరియల్ సెంటర్‌లోని మూడు ఆసుపత్రులలో చేర్చబడుతున్న మౌలిక సదుపాయాలు ఈ ప్రాంతంలోని ప్రజలకు అధిక సబ్సిడీ ఖర్చులతో సకాలంలో మరియు అధిక-నాణ్యత చికిత్సను అందిస్తాయి. అధునాతన క్యాన్సర్ కేర్‌ను ఇంటి దగ్గరే అందించడం చాలా కీలకం, తద్వారా ఈ ప్రాంతం నుండి ఎక్కువ మంది ప్రజలు ఇటువంటి చికిత్సలను పొందటం ద్వారా ప్రయోజనం పొందుతారు. మహారాష్ట్ర లోని నవీ ముంబైలోని ACTRECలోని రేడియేషన్ థెరపీ బ్లాక్ పెద్ద సంఖ్యలో రోగులకు సకాలంలో రేడియోథెరపీ అందించడమే కాకుండా అత్యంత అధునాతన పద్ధతులతో చికిత్స అందిస్తుంది. ఈ రెండూ విజయవంతమైన ఫలితం కోసం కీలకమైనవి. బాల్యం, వయోజన రక్త క్యాన్సర్లు రెండూ నయం చేయగలిగినవి కానీ, వీటికి చాలా తీవ్రమైన చికిత్సలు అవసరం. విశాఖపట్నం, ముల్లన్‌పూర్‌లో స్థాపించబడిన ICICI కేంద్రాలు అంకితమైన పిల్లలు మరియు రక్త క్యాన్సర్ కేంద్రాలు, అత్యాధునిక మల్టీడిసిప్లినరీ కేర్‌ను అందిస్తాయి. ఈ కేంద్రాలు త్వరలో ఈ ప్రాంతంలోని రోగులకు ఎముక మజ్జ మార్పిడి, సెల్యులార్ థెరపీల వంటి అధునాతన చికిత్సలను అందించే ప్రాంతీయ కేంద్రాలుగా మారుతాయి.

ICICI బ్యాంక్ నిబద్ధత యొక్క ముఖ్య లక్షణాలు:

ICICI ఫౌండేషన్ మహారాష్ట్రలోని నవీ ముంబైలో TMC యొక్క అధునాతన సెంటర్ ఫర్ ట్రీట్‌మెంట్, రీసెర్చ్ & ఎడ్యుకేషన్ ఇన్ క్యాన్సర్ (ACTREC)లో ‘ICICI రేడియేషన్ ఆంకాలజీ బ్లాక్’ని ఏర్పాటు చేస్తుంది. ఈ బ్లాక్‌లో CT స్కానర్ మరియు MRT, అవుట్‌డోర్ పేషెంట్లకు కొత్త సదుపాయం, లేబొరేటరీలు మరియు ఇన్-పేషెంట్లకు రేడియోథెరపీ సౌకర్యంతో సహా అత్యాధునిక రేడియాలజీ సౌకర్యాలు ఉంటాయి. ఇవన్నీ ఒకే పైకప్పు క్రింద పరిశోధనల కోసం వేచి ఉండే సమయాన్ని గణనీయంగా తగ్గించడంలో సహాయపడతాయి. అందువల్ల చికిత్స నాణ్యతను మెరుగుపరుస్తాయి.

ఐసిఐసిఐ ఫౌండేషన్ పంజాబ్‌లోని ముల్లన్‌పూర్, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో టిఎంసికి చెందిన హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్‌లో రెండు ‘ఐసిఐసిఐ పీడియాట్రిక్, హెమటోలాజికల్ ఆంకాలజీ బ్లాక్’లను ఏర్పాటు చేస్తుంది. ఈ కేంద్రాలు పీడియాట్రిక్, హెమటోలాజికల్ క్యాన్సర్‌కు చికిత్స చేయడానికి అవసరమైన అధునాతన పరికరాలు మరియు చికిత్సల శ్రేణిని అందిస్తాయి. ఈ సౌకర్యాలలో తీవ్రమైన కీమోథెరపీ, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్, రేడియేషన్ థెరపీ మరియు CAR-T సెల్ వంటి కొత్త ఇమ్యునోథెరపీలు ఉంటాయి, ఇవి సూపర్ స్పెషలైజ్డ్ సెంటర్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇన్-పేషెంట్ కేర్ సౌలభ్యం కోసం, కేంద్రాలలో ప్రత్యేక పడకలు, డే కేర్ యూనిట్లు, ICUలు, MRI, CT- PET స్కాన్ సౌకర్యం, జెనిటిక్స్ సహా అధునాతన పరీక్షల కోసం ప్రయోగశాలలు ఉంటాయి, ఇవి పీడియాట్రిక్, హెమటోలాజికల్ క్యాన్సర్‌లకు చికిత్స చేయడంలో కీలకం. ఈ కేంద్రాలు దేశంలోని మొత్తం దక్షిణ మరియు ఉత్తర ప్రాంతాలలో ప్రాంతీయ రెఫరల్ కేంద్రాలుగా కూడా మారతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News