- Advertisement -
క్యాన్బెరా: టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా చెలరేగడంతో 5 వికెట్లకు 302 పరుగులు చేసింది టీమిండియా. అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తున్న పాండ్యా ఈ మ్యాచ్లోనూ కేవలం 76 బంతుల్లో 92 పరుగులు చేయగా.. జడేజా 50 బంతుల్లో 66 పరుగులు చేయడం విశేషం. ఈ ఇద్దరూ కలిసి ఆరో వికెట్కు అజేయంగా 150 పరుగులు జోడించారు. ఒక దశలో 152 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన టీమ్ను ఈ ఇద్దరూ ఆదుకున్నారు. మెల్లగా మొదలుపెట్టి.. చివర్లో చెలరేగిపోయారు. బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించారు.
- Advertisement -