Friday, April 19, 2024

శ్రీలంకతో రెండో టీ20… బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా

- Advertisement -
- Advertisement -

పుణె: ఉత్కంఠభరితంగా సాగిన తొలి టి20లో అద్భుత విజయాన్ని అందుకున్న టీమిండియా శ్రీలంకతో రెండో టీ20 మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ హర్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకుని, శ్రీలంకను ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని పట్టుదలతో హార్దిక్ సేన బరిలోకి దిగుతోంది. మరోవైపు శ్రీలంకకు ఈ మ్యాచ్ చావోరేవోగా మారింది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News