Saturday, April 20, 2024

పంత్ ధనాధన్ ఇన్నింగ్స్.. 40ఏళ్ళ రికార్డు బద్దలు..

- Advertisement -
- Advertisement -

IND vs SL 2nd Test: Rishabh Pant fastest fifty against SL

న్యూఢిల్లీ: రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ రికార్డు సృష్టించాడు. కేవలం 28 బంతుల్లోనే పంత్ అర్థ సెంచరీ సాధించడం విశేషం. ఇంతకుముందు రికార్డు కపిల్ దేవ్ పేరిట ఉంది. ఆయన 30 బంతుల్లోనే 50 పరుగులు సాధించాడు. 1982లో పాకిస్తాన్‌తో కరాచీ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో కపిల్ ఈ రికార్డు సాధించారు. దాదాపు 40 సంవత్సరాల పాటు సురక్షితంగా ఉన్న రికార్డును పంత్ బద్దలు కొట్టాడు.అయితే అర్థ సెంచరీ చేసిన వెంటనే రిషబ్ పంత్ అవుటయ్యాడు. రెండో రోజు రెండో సెషన్ ముగిసేసరికి భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది.

IND vs SL 2nd Test: Rishabh Pant fastest fifty against SL

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News