హైదరాబాద్: భారత్లో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. రోజు రోజుకు భారత్లో పాజిటివ్ల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 83341 కేసులు నమోదు కాగా 1096 మంది మరణించారు. మృతుల సంఖ్యలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఆగస్టు 19వ తేదీన 1092 కేసులు రెండో అత్యధికం. ప్రస్తుతం భారత్ లో కరోనా వైరస్ 39.36 లక్షల మందికి వ్యాపించగా 68,742 మంది చనిపోయారు. కరోనా వైరస్ నుంచి 30.37 లక్షల మంది కోలుకోగా 8.3 లక్షల మంది చికిత్స పొందుతున్నారు.
ప్రపంచంలో కరోనా బాధితుల సంఖ్య 2.64 కోట్లకు చేరుకోగా 8.73 లక్షల మంది మృత్యువాతపడ్డారు. కరోనా కేసుల విషయంలో అమెరికా తొలి స్థానంలో ఉండగా వరసగా బ్రెజిల్ (40.46 లక్షల), భారత్(39.36 లక్షలు), రష్యా(10.09 లక్షలు), పెరూ (6.7లక్షలు)లు ఉన్నాయి. కరోనా బారినపడి మృతి చెందిన వారి సంఖ్యలో భారత్ మూడో స్థానంలో ఉండగా తొలి స్థానంలో అమెరికా, రెండో స్థానంలో బ్రెజిల్ దేశాలు ఉన్నాయి.