- Advertisement -
ఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 49,881 మందికి కరోనా సోకగా 517 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 80 లక్షలు దాటగా 1,20.527 మంది మృత్యువాతపడ్డారు. కరోనా వైరస్ నుంచి 73.16 లక్షల మంది కోలుకోగా 6.03 లక్షల మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 10.75 లక్షల మందికి కరోనా టెస్టులు చేయగా మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 10.65 కోట్లకు చేరుకుందని ఐసిఎంఆర్ వెల్లడించింది.
- Advertisement -