Wednesday, April 24, 2024

వచ్చే ఏడాది భారత్ -ఇంగ్లండ్ ఐదో టెస్టు!

- Advertisement -
- Advertisement -

India-England fifth Test next year

 

న్యూఢిల్లీ: భారత్, ఇంగ్లండ్‌ల మధ్య అర్ధంతరంగా నిలిచిన అయిదో టెస్టు మ్యాచ్‌ని వచ్చే ఏడాది రీ షెడ్యూల్ చేయనున్నారు. ఈ మేరకు ఇరు క్రికెట్ బోర్డుల మధ్య అంగీకారం కుదిరింది. 2022 మధ్యలో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఆ సందర్భంగా ఒక టెస్టును నిర్వహిస్తారని తెలుస్తోంది. కాగా జరగబోయే ఈ మ్యాచ్ ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా నిర్వహిస్తారా లేక ప్రత్యేక మ్యాచ్‌గా పరిగణిస్తారా అనే విషయంలో స్పష్టత రాలేదు.ఈ సిరీస్‌లో భారత్ 2 1 ఆధిక్యతలో కొనసాగుతోంది. అందుకే తాజాగా జరిగే టెస్టును ఐదో మ్యాచ్‌గా గుర్తించి సిరీస్‌ను ముగించే అవకాశాలున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News