Saturday, April 20, 2024

రాజ్యాంగం వల్లే భారతదేశం బలంగా ఉంది: గవర్నర్

- Advertisement -
- Advertisement -

India is strong because of Constitution Says Governor Tamilisai

అంబేద్కర్ దేశానికి అద్భుతమైన రాజ్యాంగం అందించారు
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

హైదరాబాద్: రాజ్యాంగం వల్లే భారతదేశం బలంగా ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. అంబేద్కర్ దేశానికి అద్భుతమైన రాజ్యాంగం అందించారని ఆమె తెలిపారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన 72వ రాజ్యాంగ దినోత్సవంలో గవర్నర్ తమిళిసై, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, మంత్రులు కెటిఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ రాజ్యాంగం కోసం రాజ్యాంగ రచన కమిటీ ఎంతో కృషి చేసిందన్నారు. ఏడు దశాబ్దాలుగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని దృఢంగా నిలిచిందన్నారు.కరోనా మహమ్మారి ఇంకా పోలేదని, ప్రతిఒక్కరూ భౌతికదూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని ఆమె సూచించారు. అందరూ తప్పనిసరిగా కరోనా టీకా వేయించుకోవాలని, రెండు డోసులు తీసుకోవాలన్నారు. ‘కరోనా వ్యాక్సినేషన్‌పై ఇంకా కొందరికీ అపోహలు ఉన్నాయన్నారు. టీకా తీసుకుంటేనే కొవిడ్ నుంచి మరింత రక్షణ ఉంటుందని, టీకా పొందినవారికి ఇన్‌ఫెక్షన్ సోకితే వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుందని, వ్యాక్సిన్ తీసుకోని వారే 99 శాతం మంది ఐసియూలో చేరుతున్నారని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News