Friday, March 29, 2024

పంత్ ఔట్…. 117/6

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్ రెండో రోజు భారత్ 41.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి బ్యాటింగ్ చేస్తుంది. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. భారత బ్యాట్స్‌మెన్లు రోహిత్ శర్మ(66), విరాట్ కోహ్లీ(27), శుభ్‌మన్ గిల్(11), అజింక్య రహానే(07), రిషబ్ పంత్(01) పరుగులు చేశారు. ఛటేశ్వర పుజారా పరుగులేమీ చేయకుండా డకౌట్ రూపంలో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో రవీచంద్రన్ అశ్విన్ (02), వాషింగ్టన్ సుందర్ (0) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జాక్ లీచ్ నాలుగు వికెట్లు పడగొట్టగా జోఫ్రా ఆర్చర్ ఒక వికెట్ తీశాడు. ఇప్పటికే ఇరు జట్లు ఒక్కో మ్యాచ్ గెలిచి 1-1 సమంగా ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News