Tuesday, April 23, 2024

రెండో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్… 99/2

- Advertisement -
- Advertisement -

India loss two wickets for 99 runs

కాన్పూర్: గ్రీన్ పార్కులో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ ఐదో రోజు కివీస్ 43 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 99 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. భారత్ 185 పరుగుల ఆధిక్యంలో ఉంది. విలియమ్ సోమర్ విల్లే 36 పరుగులు చేసి ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో శుభమన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. నాలుగో రోజు చివరలో విల్ యంగ్ రెండు పరుగులు అశ్విన్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు రూపంలో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో టామ్ లాథమ్ (48), కెన్ విలియమ్సన్(07) బ్యాటింగ్ చేస్తున్నారు.

ఇండియా తొలి ఇన్నింగ్స్: 345
ఇండియా రెండో ఇన్నింగ్స్: 234
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 296

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News