Friday, March 29, 2024

ప్రధాని సహా పార్లమెంట్ సభ్యుల జీతాల్లో 30 శాతం కోత: జవదేకర్

- Advertisement -
- Advertisement -

 

ఢిల్లీ: కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్రమంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని సహా పార్లమెంట్ సభ్యుల జీతాల్లో ఏడాది పాటు 30 శాతం కోత విధిస్తున్నామని కేంద్ర మంత్రి జవదేకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి జీతాల్లోనూ 30 శాతం కోత విధిస్తామని, జీతాల్లో కోతకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. కరోనా కట్టడికి ఎంపి లాడ్స్ నిధులను ఉపయోగిస్తామని, రెండేళ్ల పాటు ఎంపి లాడ్స్‌కు వచ్చే నిధులు రూ.7900 కోట్లు కరోనా కట్టడికి మళ్లిస్తామని జవదేకర్ స్పష్టం చేశారు. ఏప్రిల్ 1 నుంచి జీతాల్లో కోత అమలలో ఉంటుందన్నారు.

 

India President, Vice President, Governors pay cut,Union Cabinet approves Ordinance amending the salary, allowances and pension of Members of Parliament Act, 1954 reducing allowances and pension by 30%
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News