Thursday, April 25, 2024

దేశంలో పెరుగుతున్న పాజిటీవ్ కేసులు.. 541మంది మృతి

- Advertisement -
- Advertisement -

India reported 41831 New Corona Cases in 24 hrs

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటీవ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 41,831మంది కరోనా బారినపడ్డారని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. కరోనా వైరస్ కారణంగా మరో 541 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా కరోనాతో మరణించినవారి సంఖ్య 4,24,351కి చేరింది. గడిచిన 24గంటల్లో కరోనా నుంచి 39,258 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు 3,08,20,521 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలో 4,10,952 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 97.36 శాతానికి చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 1.30శాతంగా ఉన్నాయని, రోజువారీ పాజిటివిటీ రేటు 2.34 శాతంగా ఉందని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 47,02,98,596 టీకాలను పంపిణీ చేసినట్లు తెలిపింది.

India reported 41831 New Corona Cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News