Tuesday, April 23, 2024

దేశంలో మరో 2వేల కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

India Reports 3275 new corona cases

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా కేసులు క్రమంగా మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 2,323 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. కరోనాతో మరో 25 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. దేశంలో మొత్తం కేసులు 4.31కోట్లకు చేరుకోగా.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,24,348 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 2,346 మంది వైరస్‌ నుంచి బయటపడగా.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 4.25కోట్ల మందికి పైగా బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 14,996 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 192కోట్లకు పైగా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

India Reports 2323 new corona cases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News