Friday, April 26, 2024

దేశంలో 5వేలకు దిగొచ్చిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

India reports 5784 new Covid cases

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. రోజువారీ కేసులు ఐదువేలకు దిగొచ్చాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 5,784 మందికి వైరస్ సోకింది. తాజాగా మరో 252 మందిని మహమ్మారి కబలించింది. అదే సమయంలో 7,995 మంది బాధితులు కోవిడ్-19 నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇండియాలో కరోనా క్రియాశీల రేటు 0.26 శాతానికి తగ్గింది. దేశంలో ప్రస్తుతం 88,993 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3,41,38,763 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. కరోనా రికవరీ రేటు 98.37 శాతానికి పెరిగింది. నిన్నటి వరకు 133.8 కోట్లకుపైగా కోవిడ్ టీకా డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News