Thursday, April 25, 2024

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

India reports 8488 new corona cases in 24 hrs

న్యూఢిల్లీ: దేశంలో గత కొద్ది కాలంగా కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. క్రియాశీల రేటు ఊరటనిస్తుండగా, రికవరీ రేటు  రానురాను మెరుగవుతోంది. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలను విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో  కొత్తగా 8,488 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. కరోనాతో మరో 249మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.45కోట్లు దాటింది. ఇక, దేశవ్యాప్తంగా కరోనాతో 4,65,911మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్క రోజే 12,510 మంది వైరస్ నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు 3.39కోట్లకు పైగా మంది కోలుకోని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 1,18,443 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

India reports 8488 new corona cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News