Thursday, April 18, 2024

దేశంలో మరో 9,110 మందికి కరోనా

- Advertisement -
- Advertisement -

India reports 9110 new Covid-19 cases

న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 9,110 కొత్త కోవిడ్-19 కేసులు, 78 మరణాలు సంభవించాయి. అదే సమయంలో మరో 14,016 కోలుకున్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,08,47,304కి చేరింది. ఇండియాలో ఇప్పటివరకు 1,55,158 మంది కరోనాతో మృతి చెందారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1,43,625 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు భారత్ లో 1,05,48,521 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో మొత్తం 62,59,008 మందికి కరోనా టీకాలు వేసినట్టు ఆరోగ్యశాఖ పేర్కొంది. దేశంలో కరోనా రికవరీ రేటు 97.25 శాతం ఉండగా, మరణాల రేటు 1.43 శాతం ఉందని అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 8 వరకు మొత్తం 20,25,87,752 మంది నమూనాలను పరీక్షించారు. వీటిలో నిన్న 6,87,138 మంది బాధితులకు కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఐసిఎంఆర్ ప్రకటించింది.

India reports 9110 new Covid-19 cases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News