Thursday, April 25, 2024

రోహిత్ ఔట్… భారత్ 130/5

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 52 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 130 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ ఒక్కడే 49 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ డకౌట్ రూపంలో మైదానం వీడాడు. భారత బ్యాట్స్‌మెన్లలో ఛటేశ్వరా పుజారా(17), అజింక్య రహానే(27) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో రిషబ్ పంత్ (22), రవిచంద్రన్ అశ్విన్ (07) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్, బెన్ స్టోక్స్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా జాక్ లీచ్ ఒక వికెట్ తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News