Tuesday, March 19, 2024

విరాట్, శ్రేయస్ ఔట్… టీమిండియా 217/5

- Advertisement -
- Advertisement -

India scored 217 runs for 5 wickets

ముంబయి: వాంఖేడ్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ మూడో రోజు టీమిండియా 62.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 217 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుతం భారత జట్టు 480 పరుగుల ఆధిక్యంలో ఉంది. శుభమన్ గిల్ 47 పరుగులు చేసి రాచిన్ రవీంద్ర బౌలింగ్‌లో లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ 14 పరుగులు చేసి అజాజ్ పటేల్ బౌలింగ్‌లో టామ్ బ్లండెల్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. విరాట్ కోహ్లీ 36 పరుగులు చేసి రాచిన్ రవీంద్ర బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. ప్రస్తుతం క్రీజులో అక్షర పటేల్(00), వృద్ధిమాన్ సాహా(5) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్ మూడు వికెట్లు తీయగా రాచ రవీంద్ర రెండు వికెట్లు తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News