Thursday, April 25, 2024

టీమిండియా షికారు

- Advertisement -
- Advertisement -

వెల్లింగ్టన్: టెస్టు సిరీస్‌కు కాస్త సమయం ఉండడంతో భారత క్రికెటర్లు తమకు లభించిన సమయాన్ని విహార యాత్రలకు వెచ్చిస్తూ సందడి చేస్తున్నారు. ప్రకృతి అందాలకు మరో పేరుగా చెప్పుకునే న్యూజిలాండ్‌లోని సుందర పర్యాటక ప్రాంతాలను చూస్తూ భారత క్రికెటర్లు ఆనందంలో మునిగి తేలుతున్నారు. భారత క్రికెట్ జట్టుతో పాటు సహాయక సిబ్బంది ప్రస్తుతం విహార యాత్రలతో సందడిగా గడుపుతున్నారు. ఎడతెరిపి లేకుండా టి20, వన్డే సిరీస్‌లు ఆడిన టీమిండియా క్రికెటర్లకు కాస్త విశ్రాంతి లభించింది. ఇక, భారత క్రికెట్ బోర్డు కూడా ఆటగాళ్లకు పర్యాటక ప్రదేశాలు చూసేందుకు అనుమతి ఇచ్చింది. బిసిసిఐ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో కివీస్ అందాలను చూడడంలో భారత క్రికెటర్లు మునిగి పోయారు. ఒకవైపు సుందర పర్యాటక ప్రాంతాలను చూస్తూనే విందు వినోదాలతో సందడి చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను బిసిసిఐ తన వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది.
విరుష్కల సందడి


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి విహార యాత్ర అంటే ఎంతో ఇష్టం. ఏ మాత్రం విరామం లభించిన విహార యాత్రల్లో మునిగి పోతాడు. తాజాగా న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భారత్‌కు కాస్తంత విశ్రాంతి లభించింది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు భారత సారథి విరాట్ కోహ్లి. భార్య అనుష్క శర్మతో కలిసి షికార్లు చేస్తూ సరదగా గడుపుతున్నాడు. వన్డే సిరీస్ ముగిసిన తర్వాత కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకునే అవకాశం టీమిండియాకు లభించింది. ఇదే సమయంలో కోహ్లి సతీమణి అనుష్కశర్మ న్యూజిలాండ్‌లో వాలిపోయింది. అంతే విరుష్క జోడీ కివీస్ అందాలను చూడడంలో బీజీ అయి పోయారు. న్యూజిలాండ్‌లోని సుందర పర్యాటక ప్రదేశాలను చుట్టి వస్తున్నారు.

India Test Team day out at Blue Springs Waterfront

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News