Tuesday, April 23, 2024

శ్రీలంకపై భారత్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

India-vs-Sri-Lanka

మెల్‌బోర్న్: ట్వంటీ20 మహిళల ప్రపంచకప్ లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే సెమీస్ లో అడుగుపెట్టిన హర్మన్ ప్రీత్ సేన నామమాత్రమైన చివరి గ్రూప్ మ్యాచ్ లో శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాంటింగ్ ఎంచుకున్న లంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 113 పరుగులు చేయగా.. మరో 32బంతులు మిగిలి ఉండగానే భారత్ లక్ష్యాన్ని చేధించింది. భారత జట్లు ఓపెనర్లు జట్టుకు శుభారంభం అందించారు. షెఫాలీ వర్మ 47, స్మృతి మంధాన 17, హర్మన్ ప్రీత్ కౌర్ 15 పరుగులతో స్కోర్ భోర్డును పరుగులెత్తించారు. బౌలింగ్ లో రాధ యాదవ్ 4, రాజేశ్వరీ గైక్వాడ్ 2 వికెట్లు, పూనమ్ యాదవ్, శిఖా పాండే, దీప్తిశర్మ చెరో వికెట్‌ పడగొట్టారు.

India-defeat-SL

స్కోర్లు: శ్రీలంక 113/9, భారత్ 116/3

 

India vs Sri Lanka ICC Womens T20I World Cup

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News