- Advertisement -
ఢిల్లీ: సైనికుల త్యాగాలు వృథా పోవని దేశానికి హామీ ఇస్తున్నానని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మోడీ మీడియాతో మాట్లాడారు. భారత దేశం ఎలాంటి వివాదాలను కోరుకోవడం లేదని, రెచ్చగొడితే సైలెంట్గా ఉండబోమని హెచ్చరించారు. చైనాకు దీటుగా బదులిచ్చే విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గమన్నారు. భారత సార్వభౌమాధికారంపై రాజీపడే ప్రసక్తేలేదని పేర్కొన్నారు. దేశ ఐక్యత, సార్వభౌమాధికారం అత్యంత ప్రాధాన్యత అంశాలు అని చెప్పుకొచ్చారు. సైనికుల త్యాగాలు వృథా పోవని దేశానికి హామీ ఇస్తున్నానని వెల్లడించారు. చైనా, భారత సైనికుల మధ్య ఘర్షణలో కల్నల్ తో సహా 20 మంది అమరులైన సంగతి తెలిసిందే.
- Advertisement -