- Advertisement -
ఐసిసి మహిళల టీ20 ప్రపంచకప్ 2020లో భాగంగా బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న టీ20 మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. దీంతో భారత్, బంగ్లా జట్టుకు 143 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ షఫాలి వర్మ(39), జెమీమా రోడ్రిగ్స్(34), వేదా కృష్ణమూర్తి(20)లు రాణించారు. మిగతా బ్యాట్స్ వుమెన్స్ విఫలమవడంతో టీమిండియా భారీ స్కోరు సాధించలేకపోయింది. బంగ్లా బౌలర్లలో పన్నా ఘోష్, సల్మా ఖతున్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
India Women set 143 runs against Bangladesh Women
- Advertisement -