Friday, April 26, 2024

మూడో వన్డేలో గెలుపు… భారత్ కే సిరీస్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టు గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్ ను 2-1 తేడాతో భారత జట్టు గెలుపొందింది. భారత జట్టు 19.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసి విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి సపారీలు 27.1 ఓవర్లలో 99 పరుగులు చేసి ఆలౌటైన విషయం తెలిసిందే. శుభ్‌మన్ గిల్ 49 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. భారత బ్యాట్స్ మెన్లలో శ్రేయస్ అయ్యర్ (28) నాటౌట్, ఇషాన్‌కిషన్ (10), శిఖర్ ధావన్ (08), సంజూ శామ్సన్(2) నాటౌట్ పరుగులు చేశారు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ మాత్రం సిరాజ్ కు వరించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కుల్దీప్ యాదవ్ కు దక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News