Thursday, April 18, 2024

ఆర్చరీలో భారత్‌కు రజతాలు

- Advertisement -
- Advertisement -

India won two silver medals at World Archery Championships

 

న్యూఢిల్లీ: అమెరికా వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు రజత పతకాలు లభించాయి. కంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో భారత్‌కు రజతం దక్కింది. మిక్స్‌డ్ ఫైనల్లో భారత్‌కు అభిషేక్ వర్మజ్యోతి సురేఖ ఫైనల్లో ఓటమి పాలైంది. కొలంబియాకు చెందిన సారా లోపేజ్‌డానియల్ మునోజ్ జంటతో జరిగిన తుది సమరంలో పోరాడి ఓడింది. ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన పోరులో కొలంబియా జంట 154150 తేడాతో విజయం సాధించింది. ఒక దశలో భారత జోడీ ఆధిపత్యం చెలాయించింది. కానీ సమయంలో ఒత్తిడికి గురై తప్పిదాలకు పాల్పడింది. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమైన ప్రత్యర్థి జోడీ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు మహిళల కంపౌండ్ టీమ్ విభాగంలో కూడా భారత్‌కు రజతం దక్కింది. జ్యోతి సురేఖ, ముస్కాన్, ప్రియా గుర్జార్‌లతో కూడిన టీమ్ ఫైనల్లో ఓటమి పాలైంది. కొలంబియా జట్టుతో జరిగిన ఫైనల్లో భారత టీమ్ 224229 తేడాతో పరాజయం చవిచూసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News