Friday, April 26, 2024

అమెరికా ఎన్నికల్లో మనవారి సత్తా

- Advertisement -
- Advertisement -

Indian Americans have become crucial in US presidential election

 

ప్రపంచాన్ని శాసించే అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈసారి చాలా రసవత్తరంగా, ఆసక్తికరంగా జరిగాయి. ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా, ఉద్విగ్నంగా నరాలు తెగ టెన్షన్ కు గురి చేస్తూ…. నువ్వా నేనా అనే పోరులో ట్రంప్, జో బిడెన్‌లు అగ్రరాజ్యాధిపతులుగా పీఠాన్ని ఎక్కుతామని ఎవరికి వారు ధీమాగా మ్యాజిక్ ఫిగర్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో అగ్రరాజ్యం అమెరికాలో భారతీయుథలు తమ ప్రభావాన్ని క్రమంగా పెంచుకుంటూ అమెరికా రాజకీయాలలో తమదైన శైలితో అమెరికన్లను, పార్టీలను, నాయకులను ఆకట్టుకుంటూ దుసుకుపోతున్నారు.

తాజా గా జరిగిన ఎన్నికల్లో తమ ప్రాతినిధ్యాన్ని పరీక్షించుకుంటున్నారు. కాంగ్రెష్‌నల్, సెనెట్ రేసులో భారతీయ అమెరికన్లు పోటీపడ్డారు. అమెరికాలో జీవనోపాధి కోసం, మెరుగైన జీవితాన్ని తమ కుటుంబాలకు అందించడం కోసం అవకాశాలను అందిపుచ్చుకొని అవిరళ కృషి చేసి అమెరికాలో స్థిరపడి తమ అభివృద్ధితో పాటు ఆ దేశ అభివృద్ధికి నిరంతర కృషి చేస్తున్నవారు అమెరికాలో దాదాపు 40 లక్షల మంది భారతీయులు ఉండగా, ఓటు హక్కు కలిగిన వారు 19 లక్షల వరకు ఉన్నారు.

టెక్సాస్, మిచిగాన, ఫ్లోరిడా, పెన్సిల్వేనియా రాష్ట్రాలలో ఎక్కువగా ఉన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు కీలకంగా మారారు. రిపబ్లికన్ పార్టీ, విపక్ష డెమొక్రాటిక్ పార్టీల అభ్యర్థులు అయిన ట్రంప్, బిడెన్‌లు తమ ప్రసంగాలలో భారతీయుల ప్రస్తావన తీసుకురాని సందర్భమే లేదు. రెండు పార్టీలకు భారతీయ అమెరికన్లు భారీగా విరాళాలు ఇస్తారు. అమెరికాలో స్థిరపడిన మెక్సికన్ అమెరికన్ల తర్వాత అతిపెద్ద సమూహం భారతీయులది. 2016 ముందు భారతీయులు ఎక్కువగా డెమొక్రాట్ల వైపు మొగ్గు చూపేవారు, మద్దతునీ ఇచ్చేవారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత భారతీయులను తమవైపు తిప్పుకోవడంలో కొంతవరకు సఫలీకృతులయ్యారు.

అమెరికా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి, తమదైన రీతిలో చక్రం తిప్పడానికి ఇరు పార్టీల మద్దతును, మన్ననలను పొంది అమెరికా కాంగ్రెస్ ప్రతినిధుల సభ, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు సభలు, సెనేట్‌లు, ఇంకొన్ని పదవులకు జరిగిన ఎన్నికల ప్రక్రియ లో భారతీయ అమెరికన్లు ఈసారి తమ హవాను కొనసాగించారు. ఇప్పటి వరకు అందిన వార్తల ప్రకారం 18 మంది భారతీయులు గెలుపొందినట్లు తెలుస్తున్నది. రాష్ట్రస్థాయి ఎన్నికల్లో 13 మంది విజయం సాధించారు. వారిలో ఐదుగురు మహిళలు కావడం గొప్ప విశేషం.

డెమొక్రాటిక్ పార్టీ తరపున ప్రతినిధుల సభకు డాక్టర్ ఆమీ బేరా, ప్రమీల జయపాల్ రోఖన్నా, రాజా కృష్ణమూర్తిలు భారీ ఆధిక్యంతో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. ఈ నలుగురితో పాటు ఉపాధ్యక్ష పదవికి డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి, భారత సంతతికి చెందిన కమల హారిస్ కూడా ఉన్నారు. అమెరికాలోని 25 కోట్ల ఓటర్లలో 19 లక్షల మంది భారతీయ అమెరికన్ ఓటర్లను ఆకట్టుకోవడానికి ఉభయ పార్టీలు భారతీయ అమెరికన్లను ప్రచారంలో వాడుకుంటూ.. ఎన్నికల బరిలోకి కూడా దింపాయి.

ఎవరీ కమల హారిస్..? ప్రస్తుతం 55 ఏళ్ల వయసు ఉన్న కమల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ తరపున ఉపాధ్యక్ష పదవికి పోటీపడిన తొలి నల్లజాతి మహిళ, ఆసియా అమెరికన్. భారతీయ – జమైకా మూలాలున్న కమల ప్రస్తుతం కాలిఫోర్నియా సెనేటర్‌గా కొనసాగుతున్నారు. కాలిఫోర్నియా అటార్నీ జనరల్ గాను పని చేయడం జరిగింది. ఇప్పటి వరకు కేవలం ఇద్దరు మహిళలు మాత్రమే ఉపాధ్యక్ష అభ్యర్థిగా అమెరికా ఎన్నికల్లో నిలబడ్డారు. 1984లో డెమొక్రాటిక్ అభ్యర్థిగా గెరాలడ్న్ ఫెరారో, 2008లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా సారా పాలిన్‌లు పోటీ చేశారు, కానీ వీరిద్దరూ గెలుపొందలేదు. అటు తర్వాత 2020లో నిలబడ్డ కమలా హారిస్ గెలుపొందడం భారతీయులకు గర్వకారణం. నల్లజాతి మహిళలకు ఇప్పటి వరకు ఇరుపార్టీల వారు అధ్యక్ష లేదా ఉపాధ్యక్ష అభ్యర్థిత్వ టికెట్ ఇవ్వలేదు. దేశంలోనే అత్యుత్తమ ప్రజా సేవకురాల్లో ఒకరుగా పేరుగాంచి, మహిళలు, పిల్లలు వేధింపుల బారినపడకుండా కమల హారిస్ కృషి చేశారు. కార్మికుల కోసం, దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించడంలో కార్మికులతో కలిసి నడవాలనే ఆలోచనా దృక్పథం గల మహిళ నాయకురాలైన కమల కాలిఫోర్నియాలోని ఆక్లాండ్ లో వలసదారులకు జన్మించారు.

ఆమె తల్లి భారతీయ సంతతికి చెందిన వారు కాగా, తండ్రి జమైకా దేశస్థుడు. కమల హారిస్‌ను ఎంపిక చేయడానికి కారణం ఆమె తెలివైన, దృఢమైన నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి, ఉండవలసిన ప్రధాన లక్షణాలు అన్నీ ఉన్నాయి. ఒక నల్లజాతి మహిళ, వలసదారుల కుటుంబం నుంచి వచ్చిన ఆమె జాతీయ స్థాయిలో నాయకత్వ లక్షణాలు గల మహిళ, శాన్‌ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా కొనసాగారు. ఆమె వాక్చాతుర్యం, వాదనాపటిమ, ప్రజాకర్షణ కలిగిన నాయకురాలు, నేరస్థులను శిక్షించడంలోనూ, వివాహ వ్యవస్థలో సమానత్వం తీసుకురావడంలోనూ, కృషి చేసిన గొప్ప నాయకురాలు. నల్ల్ల జాతీయులురాలైనందున, ఉపాధ్యక్ష పదవికి ఎంపిక చేయడంతో ఎన్నికల సంగ్రామంలో బరిలో ఉండి గెలుపొందిన భారతీయ అమెరికన్ కావడం సంతోషదాయకం. అదే విధంగా మిచిగన్ 42వ జిల్లా నుంచి రాష్ట్ర ప్రతినిధుల సభకు ఎన్నికైన తెలుగు బిడ్డ పద్మ కుప్ప.

రాష్ట్రపతి ప్రతినిధుల సభకు ఎన్నికైన భారతీయ అమెరికన్. ఈమె 1966లో భారత్‌లోని వరంగల్‌లో జన్మించారు. 4 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులు అమెరికా తీసుకెళ్లారు. 1981లో తిరిగి భారత్ కు విచ్చేసి హైదరాబాదులోని స్టాన్లీ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసి, వరంగల్ నీట్ లో 1982- 86 మెకానికల్ ఇంజనీరింగ్ చదివి, 1988లో విద్యార్థిగా తిరిగి అమెరికా వెళ్లారు. ఆమె భర్త సుధాకర్ తాడేపల్లి, ఇద్దరు పిల్లలతో మిచిగాన్ లోని ట్రాయ్‌లో స్థిరపడడం జరిగింది. ట్రాయ్ ప్లానింగ్ కమిషనర్‌గా రెండేళ్లు పని చేశారు. 2018లో డెమొక్రాటిక్ పార్టీ తరపున రాష్ట్ర ప్రతినిధుల సభకు ఎన్నికయ్యా రు. తాజా ఎన్నికల్లో రెండోసారి కూడా విజయం సాధించారు.

వీరితో పాటు ప్రతినిధుల సభకు జెన్నీఫర్ రాజ్ కుమార్. ( న్యూయార్క్), నీమాకులకర్ణి (కెంటకీ), వందనా స్లాటర్ (వాషింగ్టన్), అమిష్ షా (ఆరిజోన) డెమొక్రటిక్ పార్టీ తరపున గెలిచారు. సెనేట్ ఎంపికైనవారు కేశ రామ్ (వెర్మాంట), జె. చౌదరి (నార్త్ కరోలిన), నిఖిల్ సవాల్ (పెన్సిల్వేనియా), జెరీమీ కూని (న్యూయార్క్), రూ పాండే మెహత (న్యూ జెర్సీ), టెక్సన్ జిల్లా జడ్జి ఎన్నికల్లో రవి నందిల్ (డెమోక్రాట), నీనా అహ్మద (పెన్సిల్వేనియా ఆడిటర్ జనరల్) విజయం సాధించారు. కొందరు ప్రముఖ భారతీయ అమెరికన్లు ఓడిపోయారు. అమెరికా రాజకీయాల్లో కీలక పాత్ర దిశగా ఈసారి భారతీయ అమెరికన్ల ముందడుగు వేశారని ఇంపాక్ట్ ఫండ్స్ సంస్థ ప్రతినిధి నీల్ మఖిజా తెలిపారు. దేశ వ్యాప్తంగా ఎన్నికల బరిలోకి దిగిన భారతీయ అమెరికన్ అభ్యర్థుల కోసం ఈ సంస్థ కోటి డాలర్లు విరాళంగా సేకరించడం విశేషం.

ప్రతిష్ఠాత్మకమైన, ఉత్కంఠ రేపుతున్న అమెరికా ఎన్నికలలో ఇండో అమెరికన్స్ ఈసారి ఎక్కువ మంది గెలుపొందడం సంతోషదాయకం. గెలవడమే కాకుండా భవిష్యత్తులో కీలకమైన స్థానాలలో నిలబడాలని, దేశ అభివృద్ధికి తమ శక్తి సామర్థ్యాలను ధార పోయాలని, ప్రపంచంలోనే పేరు పొందిన అమెరికా ప్రాశస్త్యాన్ని కాపాడుటకు నిరంతరం కృషి చేస్తూ ఉండటమే గాక అక్కడి రాజకీయాలలో చక్రం తిప్పుతూ.. ఎన్నికల బరిలో నిలబడి గెలుపొందడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రభుత్వాలలో కూడా మంత్రులుగా కీలకమైన నిర్ణయాలు, ప్రతిపాదనలు చేయడంలో భారతీయులు చురుకైన పాత్ర పోషిస్తున్నారు.

ఇటీవల న్యూజిలాండ్ మంత్రిపదవిని అధిష్టించిన ప్రియాంక రాధాకృష్ణన్‌లు భారతీయ సంతతికి చెందిన వారే. భారతీయులు ప్రపంచ నలుమూలలా విస్తరించి పలు దేశాలలో స్థిరపడటం జరిగింది. ఏ దేశమేగినా… ఎందు కాలిడినా… పొగడరా… నీ తల్లి భూమి భారతిని… అని రాయప్రోలు సుబ్బారావు అన్నట్లు…. వారు మాతృదేశమైన భారతదేశాన్ని మరిచిపోకుండా వారి పని చేస్తున్న దేశాలతో అంతర్జాతీయ సంబంధాలను పెంపొందించడానికి, అభివృద్ధి పథంలో పయనింప చేయడానికి వ్యాపార వాణిజ్యపరంగా పలు ఒప్పందాలు నెలకొల్పుటకు కృషి చేయాలని ఆశిద్దాం…

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News