న్యూఢిల్లీ: ఉత్తర కాశ్మీర్లోని కేరన్ సెక్టార్లో ఆయుధాల అక్రమ రవాణాకు ముష్కరులు ప్రయత్నించారు. ఉగ్రవాదుల కుట్రను భారత సైన్యం భగ్నం చేసింది. ఆయుధాల అక్రమ రవాణా చేస్తున్న ముష్కరుల ముఠాను సైన్యం అడ్డుకుంది. కిషన్ గంగా నదీ తీరం వద్ద ఉగ్రవాదుల కదలికలను గుర్తించిన సైన్యం, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టింది. తాడుకు టైరును కట్టి నదికి అవతి వైపు నుంచి ఆయుధాల రవాణాకు ఉగ్రవాదులు యత్నించారు. ముష్కరుల నుంచి 4ఎకె-47,8 బుల్లెట్ మ్యాగజిన్లు, 240 ఎకే రైఫిళ్లు మందుగుండు సామగ్రిని ఆర్మీ స్వాధీనం చేసుకుంది. పోజెకె నుంచి ఆయుధాలను అక్రమంగా రవాణా చేసేందుకు పాకిస్తాన్ ఆర్మీ మద్దతు ఇచ్చినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Troops detected movement on banks of Kishen Ganga River. Immediately, joint operation was launched with J&K Police. 2-3 terrorists were detected trying to transport some items in a tube tied to a rope from far bank of the river. Troops reached and recovered arms: Army Sources https://t.co/5vu2GeRFCU pic.twitter.com/l1YSS78Ecr
— ANI (@ANI) October 10, 2020