- Advertisement -
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం చైనాపై డిజిటల్ స్ట్రైక్ చేస్తూ మరో షాక్ ఇచ్చింది. భారత్ ఇప్పటికే టిక్ టాక్ సహా 59 యాప్ లను బ్యాన్ చేసింది. తాజాగా 47 చైనా యాప్లపై నిషేధం విధించింది. ఈ యాప్లు ఇంతకుముందు బ్యాన్ చేసిన యాప్లకు క్లోన్ యాప్లుగా ఉన్నాయని, వీడి సర్వర్లు చైనాలో ఉన్నాయని పేర్కొంది. ప్రోటోకాల్ పాటించకపోవడం, యూజర్ల సమాచారం భద్రంగా లేనందుకే నిషేధం విధిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. అయితే డేటా ఎలా మారుతోందో అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. సుమారు 20 యాప్ల ద్వారా డేటా ట్రాన్స్ ఫర్ అవుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ 47 యాప్ల లిస్ట్ త్వరలో విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపింది.
Indian Govt bans 47 more Chinese apps
- Advertisement -