డైరా: దుబాయ్లో దారుణం చోటుచేసుకుంది. గర్లఫ్రెండ్ను చంపి అనంతరం పోలీస్ స్టేషన్లో ఇండియన్ లొంగిపోయిన సంఘటన దుబాయ్లోని డైరాలోని మురాకాబ్బత్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… భారత్కు చెందిన 27 ఏళ్ల యువకుడు గత ఏడు సంవత్సరాల నుంచి ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు. ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. వీళ్ల ప్రేమ వ్యవహారం అమ్మాయి ఇంట్లో తెలిసిన కూడా వాళ్లు పట్టించుకోలేదు. ఈ మధ్యలో మరో వ్యక్తితో గర్ల్ ఫ్రెండ్ చనువుగా ఉండడంతో ఆమెపై పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆమె కుటుంబ సభ్యులకు తెలిపిన వాళ్లు పట్టించుకోలేదు. దీంతో ఆమె తనని మోసం చేస్తుందని గ్రహించిన అతడు… ఆమెను తన కారులో లాంగ్ డ్రైవ్కు తీసుకెళ్లి కత్తితో ఆమె గొంతును కోశాడు. అనంతరం కారు ముందు సీట్లో మృతదేహం పెట్టుకొని 45 నిమిషాలు డ్రైవ్ చేసిన అనంతరం మురాకాబ్బత్ పోలీస్ స్టేషన్లో రక్తపు మరకలతో అతడు లొంగిపోయాడు. వెంటనే పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కారు ముందు సీట్లో మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.