Friday, April 26, 2024

ముగ్గురిని చంపిన బాడీ బిల్డర్ నిర్దోషిగా విడుదల..

- Advertisement -
- Advertisement -

ముగ్గురిని చంపిన బాడీ బిల్డర్ నిర్దోషిగా విడుదలయ్యాడు
ఆత్మరక్షణ దాడిగా తీర్పు ఇచ్చిన లండన్ కోర్టు

Indian Origin builder who Killed 3 men freed in UK Court

లండన్: ఓ వీధి పోరాటంలో ముగ్గురిని హత్యగావించిన భారత సంతతికి చెందిన బాడీ బిల్డర్‌ను లండన్‌లోని క్రౌన్ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఈ ఘటనలో నిందితుడిగా విచారణ ఎదుర్కొన్న గుర్జీత్‌సింగ్(29) ఉద్దేశపూర్వకంగా హత్యలకు పాల్పడలేదని, ఆత్మరక్షణలో భాగంగా జరిపిన ఎదురు దాడిలో ఆ ముగ్గురు వ్యక్తులు హతులయ్యారని కోర్టు స్పష్టం చేసింది. తూర్పు లండన్‌లోని సెవెన్‌కింగ్స్ ప్రాంతంలో జరిగిన వీధి పోరాటంలో గుర్జీత్‌సింగ్‌పై నలుగురు వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేశారు. ఆ సందర్భంగా గుర్జీతీసింగ్ ఆత్మరక్షణ కోసం ఎదురు దాడి జరిపారు. ఈ సంఘటన దృశ్యాలు సిసిటివిలో రికార్డయ్యాయి. వాటిని పరిశీలించిన కోర్టు గుర్జీత్‌సింగ్‌ను నిర్దోషిగా తేల్చింది. దాడికి పాల్పడ్డవారు కూడా భారత సంతతికి చెందినవారే కావడం గమనార్హం. సిసిటివి దృశ్యాలను పరిశీలించిన స్థానిక పత్రిక గుర్జీత్‌సింగ్ బ్రూసిలీలా ఫైట్ చేశారని వ్యాఖ్యానించింది. ఆ పోరాటంలో ఆయన తలపై పలు గాయాలయ్యాయి.

Indian Origin builder who Killed 3 men freed in UK Court

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News