Friday, April 19, 2024

దేశంలో 50లక్షలు దాటిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

India's COVID 19 cases tally crosses 50 lakh mark

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది. పాజిటివ్ కేసులు 50లక్షలు దాటాయి. గత 24 గంటల్లో 90,123 కొత్త కోవిడ్-19 కేసులు, 1,290 మరణాలు సంభవించాయి. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 50,20,360కు పెరిగాయి. ఇందులో 9,95,933 యాక్టివ్ కేసులుండగా… 39,42,361 మంది కరోనా బాధితులు కోలుకుని నయమయ్యారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 82,066 మంది బాధితులు మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. ఇండియాలో సెప్టెంబర్ 15 వరకు 5,94,29,115 నమూనాలను పరీక్షించారు. వీటిలో నిన్న 11,16,842 నమూనాలను పరీక్షించినట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ప్రకటించింది.

India’s COVID 19 cases tally crosses 50 lakh mark

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News