- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి పెరుగుతోంది. ఇప్పటికే పాజిటివ్ కేసులు 53 లక్షల మార్కును దాటాయి. గడిచిన 24 గంటల్లో 93,337 కొత్త కోవిడ్-19 కేసులు, 1,247 మంది మృతి చెందారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 53,08,015కి చేరింది. వీటిలో 10,13,964 యాక్టివ్ కేసులుండగా.. ఇప్పటివరకు ఇండియాలో 42,08,432 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా 85,619 మృతి చెందినట్టు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే దేశంలో శుక్రవారం వరకు మొత్తం 6,24,54,254 కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా… నిన్న ఒక్కరోజులోనే 8,81,911 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్) ప్రకటించింది.
India’s COVID 19 cases tally crosses 53 lakh mark
- Advertisement -