Friday, March 29, 2024

భారత్‌లో 19 లక్షలు దాటిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

India's COVID19 tally crosses 19 lakh mark

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 19లక్షలు దాటాయి.  గత 24 గంటల్లో 52,509 కొత్త కోవిడ్-19 కేసులు, 857 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో ఇండియాలో మొత్తం సానుకూల కేసుల సంఖ్య 19,08,255కి పెరిగింది. దేశవ్యాప్తంగా 5,86,244 యాక్టివ్ కేసులుండగా… ఇప్పటివరకు 12,82,216 మంది బాధితులు నయమై కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 39,795 కోవిడ్ తో మరణించినట్టు ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది. అటు మహారాష్ట్రలో 4,57,956 మందికి కరోనా సోకింది. ఇప్పటివరకు16,142 మంది చనిపోగా..  1,42,458 యాక్టివ్ కేసులున్నాయి. 2,99,356 మంది కరోనా బాధితులు ఈ మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

India’s COVID19 tally crosses 19 lakh mark

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News