Thursday, March 28, 2024

వివాహేతర శృంగారంపై నిషేధం

- Advertisement -
- Advertisement -

జకర్తా: జీవిత భాగస్వామితో తప్ప వివాహేతర శృంగారంపై ఇండోనేసియా నిషేధం విధించింది. ఈ తీర్మానాన్ని ఇండోనేసియా పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ నిబంధన ఇండోనేసియా ప్రజలతోపాటు ఆ దేశంలో నివసించే విదేశీయులకు వర్తిస్తుంది. అదేవిధంగా గర్భనిరోధాన్ని ప్రోత్సహించడం, ప్రభుత్వ సంస్థలను, అధ్యక్షుడిని అవమానించడాన్ని కూడా ఇండోనేసియా పార్లమెంటు నిషేధం విధించింది.

ఈ మేరకు ఇండోనేసియా పీనల్ కోడ్ సవరణ తీర్మానానికి చట్టసభ్యుల ఏకగ్రీవ ఆమోదం లభించింది. సవరించిన నేర శిక్షాస్మృతి ప్రకారం ఇప్పటికే ఉన్న దైవదూషణ చట్టం మరింత విస్తృతమైంది. ఇండోనేసియా ప్రభుత్వం గుర్తించిన ఆరు మతాలు ఇస్లాం,ప్రొటెస్టాటిజం, క్యాథలిక్, హిందు, బుద్ధిజం, కన్ఫూషియాజాలను కించపరిచేవారికి జైలు శిక్ష విధించనున్నారు. మార్కిస్ట్ లెనినిస్ట్ భావజాలంతో సంబంధం ఉన్నవారికి జైలు, కమ్యూనిజం వ్యాప్తి చేసేవారికి సంవత్సరాల శిక్ష విధించనున్నారు.

అబార్షన్ నేరంగా పరిగణిచడంతోపాటు కొన్ని మినహాయింపులు పీనల్‌కోడ్ సవరణలో పేర్కొన్నారు. మహిళ ప్రాణానికి ప్రమాదం, అత్యాచారం, పిండం 12వారాలకంటే తక్కువ ఉండి వైద్యకారణాలను అనుమతించినపుడు నేర రహితంగా పరిగణిస్తారు. శిక్షాస్మృతి సవరణపై రైట్ గ్రూపులు విమర్శలు వ్యక్తం చేశాయి. కొన్ని సవరణలు సాధారణ చర్యలను కూడా నేరంగా పరిగణిస్తున్నాయని, ప్రజల వ్యక్తిగత హక్కులు, భావప్రకటన స్వేచ్ఛకు ముప్పుగా పేర్కొన్నాయి. కాగా స్వలింగ సంపర్కాన్ని చట్టవిరుద్ధంగా పరిగణించాలని ఇస్లామిక్ గ్రూపుల ప్రతిపాదనను చర్చల సమయంలో చట్టసభ సభ్యులు తొలగించారు. ఈనేపథ్యంలో కొంతమంది న్యాయవాదులు దేశంలోని ఎల్‌జిబిటిక్యూ కమ్యూనిటీ సాధించిన విజయంగా పేర్కొనడం విశేషం. ఇప్పటికే కొన్నిదేశాలు మరణదండనను రద్దు చేశాయని జాతీయ మానవ హక్కుల కమిషన్, ఇతర సంస్థలు కేపిటల్ పనిష్మెంట్ మరణశిక్షను రద్దు చేయాలని కోరినా శిక్షాస్మృతి సవరణలో వారి డిమాండ్‌ను పార్లమెంటు ఆమోదించలేదు.

అయితే కొత్త కోడ్ ప్రకారం అమలు చేయడానికి పాటించనున్నారు. మరణదండన విధించిన వ్యక్తి పది సంవత్సరాలలోపు సక్రమంగా ప్రవర్తిస్తే మరణశిక్షను జీవితకాలపు శిక్ష లేదా 20ఏళ్ల జైలుశిక్షగా శిక్షాస్మతిని సవరించారు. ఇండోనేసియా నియమ, నిబంధనల ప్రకారం ఆ దేశ పార్లమెంటు ఆమోదించిన తీర్మానం చట్టంగా మారాలంటే అధ్యక్షుడు ఆమోదిస్తూ సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే ఆ నిబంధనను రద్దు చేయాలని అధ్యక్షుడు కోరితే తప్ప 30 రోజుల అనంతరం అధ్యక్షుడు సంతకం చేయకపోయినా పార్లమెంటు ఆమోదించిన తీర్మానం అమలులోకి వస్తుంది. పార్లమెంటు ఆమోదించిన శిక్షాస్మృతి సవరణను ఆమోదిస్తూ అధ్యక్షుడు జోకో విడోడో సంతకం చేస్తారని ఆ దేశ నేతలు అంచనా వేస్తున్నారు.

ఈ సందర్భంగా మానవ హక్కుల శాఖ డిప్యూటీ మినిస్టర్ ఎడ్వర్డ్ మాట్లాడుతూ చట్ట సవరణలు పూర్తిస్థాయిలో అమలయ్యేందుకు మూడు సంవత్సరాల కాలం పడుతుందని తెలిపారు. నిబంధనల ప్రకారం సవరణలు అమలుచేసేందుకు కార్యాచరణ పాటించాలి ఉంటుంది ఈక్రమంలో ఒక్క ఏడాది కాలంలో సవరణలన్నీ అమలు చేయడం సాధ్యంకాదని స్పష్టం చేశారు. కాగా సవరించిన కోడ్ ప్రకారం వివాహేతర శృంగారానికి పాల్పడినవారికి జైలు శిక్ష విధించనున్నారు. అయితే వ్యభిచార ఆరోపణలపై పోలీసులు నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు. కొత్త కోడ్‌తో బాలి, మెట్రోపాలిటన్ జకార్తా వంటి పర్యాటక ప్రాంతాలతోసహా అనేక హోటళ్లుపై ప్రభావం చూపనుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News