Saturday, April 20, 2024

మృత్యువులోనూ వీడని బంధం

- Advertisement -
- Advertisement -
Inexhaustible bond even in death in vikarabad
అనారోగ్యంతో భర్త మృతి, గంటలోపే భార్య మృతి

మర్పల్లి: కొన్నేళ్లుగా అన్యోన్యంగా జీవిస్తున్న ఆ భార్యాభర్తల సంసారబంధం మరణంలోనూ వారికి విడదీయరాని బంధంగా మారింది. అనారోగ్యంతో భర్త మృతి చెందిన గంటలోపే మనస్థాపం చెందుతూ భార్య మృతిచెందిన హృదయ విచారణ సంఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. మర్పల్లి మండల పరిధి రావులపల్లి గ్రామానికి చెందిన పులుమద్ది బిమయ్య(70) శాంతమ్మ(65)లు దంపతులు . వీరికి ఓ కుమారుడు. బిమయ్య గతకొన్ని రోజులుగా మరింత అనారోగ్యానికి గురై మంచం ఎక్కగా, భార్య శాంతమ్మ గత రెండు నెలలక్రితం కింద పడటంతో ఆమె కాలు విరిగింది. చికిత్స చేయించుకుంటున్నా కాలు నొప్పిమాత్రం తగ్గలేదు. సోమవారం ఉదయం 5గంటల ప్రాంతంలో బిమయ్య మృతిచెందాడు. భర్త మృతి తలుచుకుంటూ ఆయన మరణించిన గంటసేపులోపే భార్య శాంతమ్మ మృతిచెందింది.

Inexhaustible bond even in death in vikarabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News