Saturday, April 20, 2024

అబ్దుల్లాపూర్ మెట్ లో రోడ్డు ప్రమాదం…. ఇన్ స్పెక్టర్ మృతి

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: రోడ్డు ప్రమాదంలో ఇన్ స్పెక్టర్, అతడి భార్య మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఇన్ స్పెక్టర్ లక్ష్మణ్ సుల్తాన్ పూన్ పోలీస్ స్టేషన్ విధులు నిర్వహిస్తున్నాడు. తన భార్య జాన్సీతో కలిసి సూర్యాపేట నుంచి హైదరాబాద్ కు కారులో వస్తున్నారు. అబ్దుల్లాపూర్ మెట్ సమీపంలోని  కార్తీక్ హోమ్స్ దగ్గర జాతీయ రహదారి 65పై ఆగి ఉన్న లారీని వెనక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మణ్(39), జాన్సీ(34) ఘటనా స్థలంలోనే మృతి చెందారు. కుమారుడు కుశ్ లవ్ చిన్న పాటి గాయాలతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మీర్ పేట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News