Thursday, April 25, 2024

డిమార్ట్ సిబ్బంది దాడిలో ఇంటర్ విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

 

రాచకొండ: ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిపై  డిమార్ట్ షాపింగ్ మాల్ సిబ్బంది దాడి చేయడంతో అతడు ఘటనా స్థలంలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సతీష్ (17) అనే విద్యార్థి తన స్నేహితులతో కలిసి శ్రై చైతన్య కాలేజీ నుంచి అనుమతి లేకుండా బయటకు వచ్చారు. డిమార్ట్ లో విద్యార్థులు షాపింగ్ చేసిన అనంతరం అక్కడ ఉన్న సిబ్బందితో ముగ్గురు విద్యార్థులు వాగ్వాదానికి దిగారు.  సతీష్ ను డిమార్ట్ సెక్యూరిటీ గార్డ్స్  తీవ్రంగా కొట్టడంతో స్పృహ  తప్పిపడిపోయాడు. వెంటనే ఆ విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సతీష్ చనిపోయాడని వైద్యులు తెలిపారు. తన కుమారుడిని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ యజమాన్యం ఎలా బయటకు పంపించిందని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.   వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

 

Intermediate Student dead in DMart Security attack

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News