Saturday, April 20, 2024

అలాంటి కిక్‌ను ఇవ్వాలని ‘మహా సముద్రం’ తీశా

- Advertisement -
- Advertisement -

Interview with Director Ajay Bhupathi

 

శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా ‘ఆర్‌ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన చిత్రం ‘మహా సముద్రం’. ఇంటెన్స్ లవ్, యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మించారు. అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం దసరా కానుకగా ఈనెల14న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు అజయ్ భూపతి మీడియాతో మాట్లాడుతూ “ఈ సినిమాలో మహా పాత్రకు కొంత మంది సెట్ అవుతారు. సమంతకి కూడా ఈ కథ బాగా నచ్చింది. ముందుగా ఆమెను అనుకున్నాను. కానీ చివరకు అదితిరావు హైదరిని తీసుకున్నాను. ఇద్దరు హీరోలతో సినిమా అంటే వచ్చే కిక్ వేరు. ఇద్దరు హీరోలున్న దళపతి, విక్రమ్ వేదా ఇలా ఎన్నో సినిమాలు తెరపై చూస్తే ఏదో తెలియని ఆనందం కలుగుతుంది.

అలాంటి ఫీల్‌ను, కిక్‌ను ప్రేక్షకులకు ఇవ్వాలని ‘మహా సముద్రం’ తీశాను. ఇది పూర్తిగా కల్పిత కథ. ఓ ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే కథ, ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగే కథ ఇది. శర్వానంద్, సిద్ధార్థల వల్లే ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఇక ‘ఆర్ ఎక్స్ 100’ బాలీవుడ్ రీమేక్ కోసం ఆఫర్ వచ్చింది. బాలీవుడ్‌లో చేయాలనే ఆసక్తి నాకు లేదు. నాకు ఇక్కడ చాలా బాగుంది. ‘మహా సముద్రం’ తరువాత మాస్ ఎంటర్‌టైనర్‌తో రాబోతోన్నాను. స్క్రిప్ట్ కూడా రెడీగా ఉంది. హీరో ఎవరనేది ఇంకా ఫిక్స్ కాలేదు. చర్చలు జరుగుతున్నాయి”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News