Saturday, April 20, 2024

అప్పుడు ఇద్దరం షాక్ అయ్యాము

- Advertisement -
- Advertisement -

Interview with Hero Akash Puri

 

యంగ్ హీరో ఆకాష్ పూరి, అందాల హీరోయిన్ కేతిక శర్మ కాంబోలో వస్తోన్న ‘రొమాంటిక్’ చిత్రం ఈనెల 29న విడుదల కాబోతోంది. పూరి కనెక్ట్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను దర్శకుడు అనిల్ పాదురి తెరకెక్కించారు. మంగళవారం హీరో ఆకాష్ పూరి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “ఓ రోజు నాన్న (పూరి జగన్నాథ్) అకస్మాత్తుగా పిలిచి ఈ సినిమాకు ఆకాష్ హీరో.. నువ్వు దర్శకుడివి అని అనిల్‌తో అన్నారు. ఇద్దరం షాక్ అయ్యాము. ‘మెహబూబా’ విడుదలైన ఆరు నెలలకు ఈ ప్రాజెక్ట్ మొదలైంది. ఇస్మార్ట్ శంకర్, రొమాంటిక్ సినిమాలు ఒకే సమయంలో జరిగాయి. ‘ఇస్మార్ట్ శంకర్’ పెద్ద హిట్ కావడంతో ‘రొమాంటిక్’ ఇంకా బాగా తీయాలని అనుకున్నాం. అప్పుడు రమ్యకృష్ణ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు.

ఆమె రావడంతో ఈ సినిమా స్థాయి మారిపోయింది. రొమాంటిక్ సినిమాలో ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లుంటాయి. ఎమోషనల్ కంటెంట్ ఉంటుంది. ఇది కేవలం యూత్ సినిమా మాత్రమే కాదు. ఫ్యామిలీ అంతా చూసే సినిమా. సినిమాలో ట్విస్ట్‌లాంటివి ఏమీ ఉండవు. ఇందులో వాస్కోడిగామా పాత్రలో కనిపిస్తాను. వాడి రూటే రాంగ్ రూట్. క్రైమ్ డిపార్ట్‌మెంట్‌లో ఉంటాడు. వాస్కోడిగామా పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. ప్రస్తుతం నేను చేస్తున్న ‘చోర్ బజార్’ సినిమా చాలా బాగా వస్తోంది. అందులో కూడా ఇలాంటి సాలిడ్ కారెక్టరైజేషన్ ఉంది. బచ్చన్ సాబ్ అనే పాత్రలో కనిపిస్తాను. ఇది యాక్షన్ బేస్డ్ ఫిలిం. దాదాపు షూటింగ్ పూర్తయింది. వచ్చే ఏడాది విడుదల చేస్తాం”అని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News