Saturday, April 20, 2024

సాయి పల్లవిలా క్యారెక్టర్స్ చేయాలనుంది

- Advertisement -
- Advertisement -

Interview with heroine Geeth Saini

 

‘పుష్పక విమానం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమవుతున్న మరో యువ తార గీత్ సైని. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ‘పుష్పక విమానం’ చిత్రంలో మీనాక్షి అనే క్యారెక్టర్‌తో ఆమె ప్రేక్షకుల ముందుకొస్తోంది. శుక్రవారం ‘పుష్పక విమానం’ విడుదలవుతోంది. ఈ సందర్భంగా గీత్ సైని మాట్లాడుతూ “ఈ చిత్రంలో మీనాక్షి… చిట్టిలంక సుందర్ (ఆనంద్ దేవరకొండ) భార్య. తను పెళ్లయ్యాక ఇంట్లోంచి వెళ్లిపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. మీనాక్షి క్యారెక్టర్‌లో నటించడం అంత సులువు కాదు. ఎప్పుడూ ఒక మూడ్‌లో ఉండాల్సి వచ్చేది. ఇక ఆనంద్ చాలా మంచి వ్యక్తి. షూటింగ్ టైమ్‌లో చాలా సపోర్టివ్‌గా ఉండేవారు. నా కెరీర్‌లో ఇంత పెద్ద స్పాన్ ఉన్న సినిమా చేస్తాననుకోలేదు. ఇక సాయి పల్లవిలా డ్యాన్స్ బేస్డ్ క్యారెక్టర్స్ చేయాలని ఉంది” అని చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News