Thursday, April 25, 2024

రాణించిన ధావన్, శ్రేయస్.. రాజస్థాన్ లక్ష్యం 162

- Advertisement -
- Advertisement -

దుబాయ్:‌ ఐపిఎల్ 13వ సీజన్ లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 161 పరుగులు  చేసింది. దీంతో ఢిల్లీ, రాజస్థాన్ జట్టుకు 162 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఢిల్లీ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(57), కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌(53) అర్ధశతకాలతో రాణించారు. మిగతా బ్యాట్స్ మెన్స్ విఫలమవ్వడంతో ఢిల్లీ జట్టు భారీ స్కోరు సాధించలేకపోయింది. రాజస్థాన్‌ స్టార్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు పడగొట్టాడు. జయదేవ్‌ ఉనద్కత్‌ రెండు వికెట్లు తీయగా కార్తీక్‌ త్యాగీ, శ్రేయస్‌ గోపాల్‌ చెరో వికెట్‌ తీశారు.

IPL 2020: DC Setup 162 Runs against RR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News