Thursday, April 25, 2024

సెంచరీతో చెలరేగిన ధావన్.. చెన్నైపై ఢిల్లీ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

షార్జా: షార్జాలో శనివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 180 పరుగుల లక్షాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ అద్భుత సెంచరీతో నాటవుట్‌గా నిలవగా, అక్షర్ పటేల్ చివరి ఓవర్లో మూడు సిక్స్‌లు బాది జట్టుకు విజయాన్ని అందించాడు. చివరి ఓవర్‌లో ఢిల్లీ విజయానికి 17 పరుగులు అవసరం కాగా, ఆ ఓవర్ వేసిన జడేజా 20 పరుగులు సమర్పించుకున్నాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేపట్టిన చెన్నై అంబటి రాయుడు, జడేజాలు మెరవడంతో నాలుగు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఓపెనర్ డుప్లెసిస్ 47 బంతుల్లో 58 పరుగులతో మెరవగా, షేన్ వాట్సన్ 36 పరుగులు చేశాడు. కెప్టెన్ ధోనీ కేవలం 3 పరుగులే చేసినా అంబటి రాయుడు, జడేజాలు చివర్లో బ్యాట్ ఝళిపించడంతో చెన్నై గౌరవప్రదమైన స్కోరు సాధించింది. రాయుడు 25 బంతుల్లో నాలుగు సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 45 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా.. జడేజా 13 బంతుల్లోనే నాలుగు సిక్స్‌లు బాది 33 పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో నోర్జెకు రెండు వికెట్లు దక్కగా, తుషార్ దేశ్‌పాండె, రబడలకు చెరో వికెట్ దక్కింది.

IPL 2020: DC Win by 5 Wickets against CSK

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News