Friday, April 26, 2024

ఆరేసిన పంజాబ్..

- Advertisement -
- Advertisement -

ఆరేసిన పంజాబ్
గేల్ మెరుపులు, రాణించిన మణ్‌దీప్, కోల్‌కతాపై కింగ్స్ గెలుపు

షార్జా: ఐపిఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వరుస విజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 8 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు సాధించింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 4 సిక్సర్లు, మూడు ఫోర్లతో 57 పరుగులు చేశాడు. కెప్టెన్ మోర్గాన్ రెండు సిక్సర్లు, ఐదు ఫోర్లతో 40 పరుగులు సాధించాడు. చివర్లో ఫెర్గూసన్ వేగంగా ఆడి 24 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ప్రత్యర్థి బౌలర్లలో షమి మూడు, బిష్ణోయి, జోర్డాన్ రెండేసి వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 18.5 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ మణ్‌దీప్ సింగ్ అజేయంగా 66 పరుగులు చేశాడు. కెప్టెన్ రాహుల్ 28 పరుగులు సాధించాడు. ఇక మెరుపు ఇన్నింగ్స్ ఆడిన గేల్ 29 బంతుల్లోనే ఐదు సిక్స్‌లు, రెండు ఫోర్లతో 51 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.

IPL 2020: KXIP Win by 8 Wickets against KKR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News