- Advertisement -
అబుదాబి: ఐపిఎల్ 13వ సీజన్ లో భాగంగా అబుదాబి వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు ముంబై 196 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ రోహిత్ శర్మ(80) అర్థ శతకంతో చెలరేగాడు. భారీ సిక్సర్లతో అలరించాడు. సూర్యకుమార్ యాదవ్ 47 పరుగులతో రాణించాడు. కోల్ కతా బౌలర్లలో శివమ్ మావి రెండు వికెట్లు తీయగా.. రస్సెల్, నరైన్ తలో వికెట్ తీశారు.
IPL 2020: MI Setup 196 runs to KKR
- Advertisement -