ముంబయి: ఐపిఎల్ 13వ సీజన్ లో భాగంగా జరుగుతున్న తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, చెన్నై జట్టుకు పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టు నిర్ణిత 20 ఓవర్లలో వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ(182) తొలి వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. రోహిత్ నెమ్మెదిగా ఆడినా మరో ఓపెనర్ డికాక్(33) తనదైన షాట్లతో అలరించాడు. వీరిద్దరూ తొలి వికెట్ కు 46 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకోల్పిన తర్వాత రెండు పరుగుల వ్యవధిలో ఔటయ్యారు. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్(17), సౌరవ్ థివారి(42), హర్దిక్ పాండ్యా(14), పోలార్డ్(18)లు పర్వాలేదనిపించారు. చెన్నై బౌలర్లలో నిగిడి మూడు వికెట్లు పడగొట్టగాడు. రవీంద్ర జడేజా, దీపక్ చాహర్ లు తలో రెండు వికెట్లు తీయగా.. చావ్లా, సామ్ కర్రన్ లు చెరో వికెట్ దక్కించుకన్నారు.
IPL 2020: Mumbai set up 163 Runs Target to CSK