Thursday, April 25, 2024

ముంబైకి అమిత్ మిశ్రా షాక్.. వెంటవెంటనే రోహిత్, హర్దిక్ ఔట్

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఐపీఎల్‌ 2021లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ముంబైకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌(1)ను స్టాయినీస్‌ పెవిలియన్ కు పంపించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్(24) కొద్దిసేపటికే వికెట్ చేజార్చుకున్నాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రం దూకుడు బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో అర్థ శతకానికి చేరువైన రోహిత్(44) అమిత్ మిశ్రా బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించి ఔటయ్యాడు. ఆ వెంటనే హర్దిక్ పాండ్యా(0)ను కూడా మిశ్రా వెనక్కి పంపించి ముంబైకి డబుల్ షాక్ ఇచ్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చి కృనాల్ పాండ్యా(01)కూడా ఔట్ కావడంతో ముంబై జట్టు కష్టాల్లో పడింది. దీంతో ముంబై 11 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఇషాన్ కిషన్(05), పోలార్డ్(0)లు ఉన్నారు.

IPL 2021: Amit Mishra dismisses Rohit and Pandya

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News