- Advertisement -
ముంబయి: ఐపిఎల్ 14లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ జట్టుకు చెన్నై 189 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. 7 పరుగులకే ఓపెనర్లు డు ప్లిసెస్(0), గైక్వాడ్(5)లను కోల్పోయి చెన్నై జట్టును సురేష్ రైనా(54), మొయిన్ అలీ(36)లు ఆదుకున్నారు. చివర్లలో జడేజా(26), శ్యామ్ కర్రన్(34)లు మెరుపు బ్యాటింగ్ తో జట్టుకు భారీ స్కోరు అందించారు. ఢిల్లీ బౌలర్లలో క్రిస్ వోక్స్, అవేష్ ఖాన్ లు చెరో రెండు వికట్లు పడగొట్టగా.. రవిచంద్రన్ అశ్విన్, టామ్ కర్రన్ లు ఒక్కో వికెట్ తీశారు.
IPL 2021: CSK Set up target 189 runs against DC
- Advertisement -