Friday, April 26, 2024

ఐపిఎల్-2021 వేలం తేదీ ఖరారు

- Advertisement -
- Advertisement -

ముంబై: ఐపిఎల్-2021 వేలం తేదీ ఖరారు అయ్యింది. చెన్నై వేదికగా ఫిబ్రవరి 18వ తేదీన ఐపిఎపల్ ప్లేయర్స్ వేలం జరగనున్నట్లు బుధవారం ఐపిఎల్ యాజమాన్యం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. ఐపిఎల్ లో పాల్గొంటున్న 8 జట్లు మొత్తం 140 మంది ఆటగాళ్లను అంటిపెట్టుకోగా, 57 మంది ఆటగాళ్లను రిలీజ్ చేశాయ్. ఇక, ఐపిఎల్ కాంట్రాక్ట్ లేని ఆటగాళ్లు ఫిబ్రవరి 2వ తేదీలోగా ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కాగా, పంజాబ్ ప్రాంఛైజీ అత్యధికంగా రూ.5.32 కోట్లతో ఈ వేలంలో దిగనున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా ఆటగాళ్లు మ్యాక్స్ వెల్, స్టీవ్ స్మిత్ లపై అన్ని ప్రాంఛైజీలు ఆసక్తి చూపుతున్నాయి. మార్చి 25వ తేదీ నుంచి ఐపిఎల్ 14వ సీజన్ ప్రారంభమయే అవకాశాలు ఉన్నాయి.

IPL 2021 Mini Auction Date Finalized

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News